తెలంగాణలో 36 గంటల పాటు మీసేవ సేవలు నిలిపివేత
తెలంగాణలో 36 గంటల పాటు మీసేవ సేవలు నిలిపివేత
Komidala Mahender reddy
కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్, మెయింటెనెన్స్ పనుల నేపథ్యంలో నిర్ణయం
సోమవారం ఉదయం 8 గంటల తర్వాత సేవలు పునఃప్రారంభం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల సేవలు 36 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొత్త సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయడం, సాంకేతిక పరమైన మెయింటెనెన్స్ పనులు చేపట్టడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో మీసేవ వెబ్సైట్తో పాటు అన్ని సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవలు ఈ వ్యవధిలో అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు.అధికారుల ప్రకటన ప్రకారం, ఈ సేవలు సోమవారం ఉదయం 8 గంటల తర్వాత తిరిగి సాధారణ స్థితికి వస్తాయి. కొత్త సాఫ్ట్వేర్ అమలు ద్వారా సేవల వేగం, పారదర్శకత మరింత మెరుగుపడుతుందని తెలిపారు.
అత్యవసర పనుల కోసం మీసేవ కేంద్రాలను ఆశ్రయించే ప్రజలు ముందుగానే తమ పనులను పూర్తిచేసుకోవాలని సూచించారు. సేవలు నిలిపివేతపై ఇప్పటికే అన్ని కేంద్రాలకు సమాచారం అందజేసినట్లు అధికారులు పేర్కొన్నారు.ఈ మార్పులతో భవిష్యత్తులో వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి