Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాజకీయాల్లో కొత్త మలుపు? జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 04, 2026 12:10 AM

తెలంగాణలో 36 గంటల పాటు మీసేవ సేవలు నిలిపివేత

తెలంగాణలో 36 గంటల పాటు మీసేవ సేవలు నిలిపివేత

తెలంగాణలో 36 గంటల పాటు మీసేవ సేవలు నిలిపివేత
April 03, 2026 10:17 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌, మెయింటెనెన్స్ పనుల నేపథ్యంలో నిర్ణయం

సోమవారం ఉదయం 8 గంటల తర్వాత సేవలు పునఃప్రారంభం

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల సేవలు 36 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్‌ చేయడం, సాంకేతిక పరమైన మెయింటెనెన్స్ పనులు చేపట్టడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో మీసేవ వెబ్‌సైట్‌తో పాటు అన్ని సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవలు ఈ వ్యవధిలో అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు.అధికారుల ప్రకటన ప్రకారం, ఈ సేవలు సోమవారం ఉదయం 8 గంటల తర్వాత తిరిగి సాధారణ స్థితికి వస్తాయి. కొత్త సాఫ్ట్‌వేర్ అమలు ద్వారా సేవల వేగం, పారదర్శకత మరింత మెరుగుపడుతుందని తెలిపారు.

అత్యవసర పనుల కోసం మీసేవ కేంద్రాలను ఆశ్రయించే ప్రజలు ముందుగానే తమ పనులను పూర్తిచేసుకోవాలని సూచించారు. సేవలు నిలిపివేతపై ఇప్పటికే అన్ని కేంద్రాలకు సమాచారం అందజేసినట్లు అధికారులు పేర్కొన్నారు.ఈ మార్పులతో భవిష్యత్తులో వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News