Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:43 AM

తెలంగాణలో 36 గంటల పాటు మీసేవ సేవలు నిలిపివేత

తెలంగాణలో 36 గంటల పాటు మీసేవ సేవలు నిలిపివేత

తెలంగాణలో 36 గంటల పాటు మీసేవ సేవలు నిలిపివేత
03-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌, మెయింటెనెన్స్ పనుల నేపథ్యంలో నిర్ణయం

సోమవారం ఉదయం 8 గంటల తర్వాత సేవలు పునఃప్రారంభం

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల సేవలు 36 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్‌ చేయడం, సాంకేతిక పరమైన మెయింటెనెన్స్ పనులు చేపట్టడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో మీసేవ వెబ్‌సైట్‌తో పాటు అన్ని సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవలు ఈ వ్యవధిలో అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు.అధికారుల ప్రకటన ప్రకారం, ఈ సేవలు సోమవారం ఉదయం 8 గంటల తర్వాత తిరిగి సాధారణ స్థితికి వస్తాయి. కొత్త సాఫ్ట్‌వేర్ అమలు ద్వారా సేవల వేగం, పారదర్శకత మరింత మెరుగుపడుతుందని తెలిపారు.

అత్యవసర పనుల కోసం మీసేవ కేంద్రాలను ఆశ్రయించే ప్రజలు ముందుగానే తమ పనులను పూర్తిచేసుకోవాలని సూచించారు. సేవలు నిలిపివేతపై ఇప్పటికే అన్ని కేంద్రాలకు సమాచారం అందజేసినట్లు అధికారులు పేర్కొన్నారు.ఈ మార్పులతో భవిష్యత్తులో వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

తెలంగాణలో 36 గంటల పాటు మీసేవ సేవలు నిలిపివేత

Article Image

కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌, మెయింటెనెన్స్ పనుల నేపథ్యంలో నిర్ణయం

సోమవారం ఉదయం 8 గంటల తర్వాత సేవలు పునఃప్రారంభం

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల సేవలు 36 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్‌ చేయడం, సాంకేతిక పరమైన మెయింటెనెన్స్ పనులు చేపట్టడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో మీసేవ వెబ్‌సైట్‌తో పాటు అన్ని సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవలు ఈ వ్యవధిలో అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు.అధికారుల ప్రకటన ప్రకారం, ఈ సేవలు సోమవారం ఉదయం 8 గంటల తర్వాత తిరిగి సాధారణ స్థితికి వస్తాయి. కొత్త సాఫ్ట్‌వేర్ అమలు ద్వారా సేవల వేగం, పారదర్శకత మరింత మెరుగుపడుతుందని తెలిపారు.

అత్యవసర పనుల కోసం మీసేవ కేంద్రాలను ఆశ్రయించే ప్రజలు ముందుగానే తమ పనులను పూర్తిచేసుకోవాలని సూచించారు. సేవలు నిలిపివేతపై ఇప్పటికే అన్ని కేంద్రాలకు సమాచారం అందజేసినట్లు అధికారులు పేర్కొన్నారు.ఈ మార్పులతో భవిష్యత్తులో వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News