Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:55 PM

తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కు వెంపటి విద్యార్థులు ఎంపిక

తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కు వెంపటి విద్యార్థులు ఎంపిక

తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కు వెంపటి విద్యార్థులు ఎంపిక
January 18, 2026 06:11 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండి కరణ్



తెలంగాణ క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రం జేఎన్ఎస్ ఆవరణలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 4వతరగతి ప్రవేశానికి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంపటి నుండి రాష్ట్రస్థాయిలో జరిగిన ఎంపికలో ఉత్తమ ప్రతిభ కనబరిచి చిర్రకీర్తన, గౌరు అక్షయ్ కుమార్ ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు.. వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించి మెమొంటో అందజేసి అభినందనలు తెలియజేశారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనర్సమ్మ మాట్లాడుతూ క్రీడా పాఠశాలలోఒకే దగ్గర పాఠాలు,క్రీడా నైపుణ్య శిక్షణ ఉంటుందని,11 క్రీడాంశాలు అథ్లెటిక్స్,జిమ్నాస్టిక్స్,రెజ్లింగ్, హ్యాండ్ బాల్,వాలీబాల్,కబడ్డీ, ఖో ఖో,బ్యాట్మింటన్,స్విమ్మింగ్, టెన్నిస్, క్రికెట్ విభాగాలలోశిక్షణ ఇస్తారని, విద్యతోపాటు క్రీడలు కూడా ముఖ్య భాగమని క్రీడలు వ్యక్తిత్వాన్ని రూపొందించడం,మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, క్రమశిక్షణను నేర్పిస్తాయని,పాఠశాలలో చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని,విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మల్లెపాక రవీందర్, బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రం, మాలోతు కృష్ణ, గుండ్ల ఆంజనేయులు,రామణబోయిన మౌనిక, అబ్బగాని మంజుల, శీలోజు రమాదేవి పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News