Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:21 AM

తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కు వెంపటి విద్యార్థులు ఎంపిక

తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కు వెంపటి విద్యార్థులు ఎంపిక

తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కు వెంపటి విద్యార్థులు ఎంపిక
January 18, 2026 06:11 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండి కరణ్



తెలంగాణ క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రం జేఎన్ఎస్ ఆవరణలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 4వతరగతి ప్రవేశానికి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంపటి నుండి రాష్ట్రస్థాయిలో జరిగిన ఎంపికలో ఉత్తమ ప్రతిభ కనబరిచి చిర్రకీర్తన, గౌరు అక్షయ్ కుమార్ ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు.. వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించి మెమొంటో అందజేసి అభినందనలు తెలియజేశారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనర్సమ్మ మాట్లాడుతూ క్రీడా పాఠశాలలోఒకే దగ్గర పాఠాలు,క్రీడా నైపుణ్య శిక్షణ ఉంటుందని,11 క్రీడాంశాలు అథ్లెటిక్స్,జిమ్నాస్టిక్స్,రెజ్లింగ్, హ్యాండ్ బాల్,వాలీబాల్,కబడ్డీ, ఖో ఖో,బ్యాట్మింటన్,స్విమ్మింగ్, టెన్నిస్, క్రికెట్ విభాగాలలోశిక్షణ ఇస్తారని, విద్యతోపాటు క్రీడలు కూడా ముఖ్య భాగమని క్రీడలు వ్యక్తిత్వాన్ని రూపొందించడం,మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, క్రమశిక్షణను నేర్పిస్తాయని,పాఠశాలలో చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని,విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మల్లెపాక రవీందర్, బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రం, మాలోతు కృష్ణ, గుండ్ల ఆంజనేయులు,రామణబోయిన మౌనిక, అబ్బగాని మంజుల, శీలోజు రమాదేవి పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News