తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల వెల్లువ
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల వెల్లువ
Biksham
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర కొనసాగుతోంది. సూర్యాపేట పట్టణం ముప్పై నాలుగో వార్డుకు చెందిన కాంటేకార్ రఘుమోహన్, షేక్ జానిభాష, విజయ్ మోహన్, శ్రావణి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ వారికి పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు.అనంతరం వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఆశల పార్టీ అని అన్నారు. గత డెబ్బై నుంచి ఎనభై ఏళ్ల పాలనలో బహుజన వర్గాలకు తగిన న్యాయం జరగలేదని విమర్శించారు. అందుకే ప్రజలు పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు.రాబోయే రోజుల్లో చేరికలు మరింత వేగం పెరుగుతాయని, ప్రజల మద్దతుతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, పార్టీ నాయకుడు కుంభం వెంకన్నతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి