తెలంగాణ ప్రభుత్వం పీర్సీని వెంటనే అమలు చేయాలి
తెలంగాణ ప్రభుత్వం పీర్సీని వెంటనే అమలు చేయాలి
Sthanikam District Staff Reporter
జె.యాకయ్య TSUTF రాష్ట్ర ఆడిట్ కమిటి కన్వీనర్
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్
పిఆర్సీ కమిటీ వేసి రెండున్నరు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కమిటీ నివేదిక తెప్పించికొని ప్రభుత్వం అమలు చేయకపోవడం సరైన విధానం కాదని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలనీ ఈరోజు భువనగిరిలోనే గోపి విజ్ఞాన కేంద్రంలో జరిగిన టీఎస్ యుటిఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొనిన టి ఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటి కన్వీనర్ జె యాకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జి వో 25ను సవరించిన తర్వాతనే రేషన్లైజేషన్ అమలు చేయాలని, బిల్లుల బకాయిలను వెంటనే చెల్లించాలని, డి ఏ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ముక్కెర్ల యాదయ్య, ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు,ఉపాధ్యక్షులు కే మమత కోశాధికారి బి ముత్యాలు,జిల్లా కార్యదర్శులు డి.స్వామి,పి.వెంకటరెడ్డి కె.రవికుమార్,జివి రమణారావు,కెబివి మేరీ,సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి