Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:53 AM

తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల & కళాశాలలో (ఆర్మూర్ )నూతన ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల & కళాశాలలో (ఆర్మూర్ )నూతన ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల & కళాశాలలో (ఆర్మూర్ )నూతన ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
January 21, 2026 04:31 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ :ఆర్మూరు పట్టణంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో(టీజీఎంఆర్ఎస్ & జెసి)2026 విద్యాసంవత్సరానికి గాను నూతన ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ నహిదా ఫిర్దోసే తెలిపారు.ఐదవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో ఎంపీసీ, బైపీసీ మరియు గ్రూప్స్ కోర్సులలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా నూతన ప్రవేశాల కరపత్రాలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. అనంతరం ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ నాయకులు వినయ్ రెడ్డిని కలిసి ప్రవేశాల వివరాలపై చర్చించారు.గత విద్యాసంవత్సరంలో పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత, ఇంటర్మీడియట్‌లో 98 శాతం ఉత్తీర్ణత సాధించామని ప్రిన్సిపల్ తెలిపారు. అదేవిధంగా ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర స్థాయిలో 3వ, 12వ ర్యాంకులు సాధించడం కళాశాల ప్రతిభకు నిదర్శనమన్నారు.విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన, పోషకాహారాన్ని కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. అర్హత గల మైనారిటీ విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ప్రవేశాలకు ఆసక్తి ఉన్న విద్యార్థినులు మామిడిపల్లిలోని తిరుమల కాలనీలో ఉన్న మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలను సంప్రదించి దరఖాస్తులుఅందజేయవచ్చని తెలిపారు.మరిన్ని వివరాల కోసం 79950 37941నెంబర్‌నుసంప్రదించవచ్చనిఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉందని వెల్లడించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News