Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రుల ఆర్థిక సహాయం “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 03, 2026 11:56 AM

తెలంగాణ ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు : రూ.44 వేల కోట్ల భారీ ఆదాయం

తెలంగాణ ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు : రూ.44 వేల కోట్ల భారీ ఆదాయం

తెలంగాణ ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు : రూ.44 వేల కోట్ల భారీ ఆదాయం
April 03, 2026 09:32 AM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

​ తెలంగాణ రాష్ట్ర ఖజానాకు మద్యం అమ్మకాలు కాసుల వర్షం కురిపించాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చరిత్రలో తొలిసారిగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.44,557 కోట్ల భారీ ఆదాయాన్ని గడించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయంలో 7% వృద్ధి నమోదు కావడం విశేషం.

​ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం. ​ఎక్సైజ్ శాఖకు వచ్చిన ఈ భారీ ఆదాయంలో నేరుగా మద్యం అమ్మకాల ద్వారా రూ.39,368 కోట్లు సమకూరాయి. కొత్త దుకాణాల దరఖాస్తు రుసుము, వైన్స్ మరియు బార్ల వార్షిక అద్దె ద్వారా మరో రూ.5,189 కోట్ల ఆదాయం లభించింది. కేవలం డిసెంబర్ నెలలోనే పండుగలు, న్యూ ఇయర్ వేడుకల పుణ్యమా అని రూ.5,051 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ​గత ఆర్థిక సంవత్సరంలో (2024-25) ఎక్సైజ్ శాఖకు రూ.40,209 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరంలో అది ఏకంగా రూ.44,557 కోట్లకు చేరుకుంది. పకడ్బందీ నిఘా, డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పెరగడం వల్ల ఈ స్థాయి ఆదాయం సాధ్యమైందని అధికారులు విశ్లేషిస్తున్నారు. ​రాష్ట్ర ఆదాయ వనరుల్లో ఎక్సైజ్ శాఖ అత్యంత కీలక పాత్ర పోషిస్తుండగా, ఈ ఏడాది వచ్చిన రికార్డు స్థాయి వసూళ్లు ప్రభుత్వానికి భారీ ఊరటనిచ్చాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News