తెలంగాణ భవన్లో కేటీఆర్ కి సంఘీభావం తెలిపిన:ఖేఢ్ మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ భవన్లో కేటీఆర్ కి సంఘీభావం తెలిపిన:ఖేఢ్ మాజీ ఎమ్మెల్యే
Krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, అక్రమంగా మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై ఏర్పాటు చేసిన విచారణకు ఆయన ధైర్యంగా హాజరై తెలంగాణ భవన్కు విచ్చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ గారిపై ఈ విధమైన విచారణలు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.ఈ విచారణకు కేటీఆర్ ఎలాంటి భయాందోళనలకూ లోనుకాకుండా,సింహంలా తెలంగాణ భవన్కు వచ్చి విచారణకు హాజరుకావడం ఆయన ధైర్యానికి, నిబద్ధతకు నిదర్శనం. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ తప్పులను ఎండగడుతున్న నాయకుడిగా ఆయన మరోసారి తన స్థాయిని చాటుకున్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ కి పూర్తి మద్దతుగా నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి తెలంగాణ భవన్కు చేరుకొని,కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే నాయకులందరికీ తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి