: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ పులిపలుపుల సునీత–వీరస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామపంచాయతీకి నూతనంగా కొనుగోలు చేసిన వాటర్ ట్యాంకర్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి గ్రామపంచాయతీ పాలకవర్గం కృషి చేస్తోందని సర్పంచ్ తెలిపారు. గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరచడంలో వాటర్ ట్యాంకర్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ నీల నరసింహ, వార్డు సభ్యులు మారగాని మాధవి, బజ్జూరి నరసింహ, నీల ఐలయ్య, రేగులగడ్డ మన్నెమ్మ, వేముల లక్ష్మీదేవి, బద్దం స్వరూప, నాలిక నరసింహ, గ్రామపంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్లు, ఉపసర్పంచ్ సంఘ బంధం అధ్యక్షురాలు, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి