PRINT TIME: February 23, 2026 11:14 PM
టేకుమట్లలో జాల మల్లమ్మ మృతి
టేకుమట్లలో జాల మల్లమ్మ మృతి
February 03, 2026 01:30 PM
7 Views
స్థానికం ప్రతినిధి :
సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud
కుటుంబాన్ని పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్
సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన జాల మల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ మృతురాలి నివాసానికి చేరుకుని పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్, ఈ దుఃఖ సమయంలో ధైర్యంగా ఉండాలని హితవు పలికారు. పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆత్మకూరు మండల అధ్యక్షులు బొల్లే సైదులు, జాల సైదులు, బొర్రాజు జానయ్య, కడెం అంజయ్య, జాల శంకర్, మామిడి ఉదయ్, ఎరుపుల రాజు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి