టీపీసీసీ సోషల్ మీడియా ఆదేశాల మేరకు ఖేఢ్ లో ఎన్నికల ప్రచారం
టీపీసీసీ సోషల్ మీడియా ఆదేశాల మేరకు ఖేఢ్ లో ఎన్నికల ప్రచారం
Krishna
టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ నియోజికవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందు ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నారాయణాఖేడ్ మున్సిపల్ పరిధిలోని 2వ మరియు 3వ వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి,ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యుడు నాగేష్ శెట్కార్,పీసీసీ సభ్యుడు కె. శ్రీనివాస్లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను నేరుగా కలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి,రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ప్రజల నుంచి మంచి స్పందన లభించగా, కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకం మరోసారి స్పష్టంగా కనిపించింది.టీపీసీసీ సోషల్ మీడియా ఆదేశాల మేరకు ఖేడ్ నియోజికవర్గంలో సోషల్ మీడియా సమన్వయంతో పాటు ఎన్నికల ప్రచార కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా కొనసాగించనున్నట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి