టీబీ నిర్మూలనకు సంగారెడ్డి ముందడుగు: జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య
టీబీ నిర్మూలనకు సంగారెడ్డి ముందడుగు: జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య
Krishna
టీబీ రహిత జిల్లానే లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి సబ్ సెంటర్ వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించి, 100 రోజుల “టీబీ ముక్త్ భారత్ అభియాన్ v2.0” కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీబీ పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని,ప్రజల్లో అవగాహన పెంచితే దీన్ని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమని చెప్పారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీబీ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాయని తెలిపారు.జిల్లాలో మే 15 వరకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, అధిక కేసులు ఉన్న ప్రాంతాల్లో ఇంటింటికీ సర్వేలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.14 సంవత్సరాల పైబడినవారితో పాటు గర్భిణీలు,రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తూ,మొబైల్ ఎక్స్-రే వాహనాల ద్వారా వెంటనే ఫలితాలు అందజేస్తున్నారు. అవసరమైన వారికి ఉచిత చికిత్స, మందులు అందిస్తున్నామని తెలిపారు.టీబీ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి పూర్తి చికిత్స తీసుకోవాలని ప్రజలకు సూచించారు.ఈ ర్యాలీలో విద్యార్థులు,ఆరోగ్య సిబ్బంది,ఆశా వర్కర్లు పాల్గొని నినాదాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు.పోలీసులు, అధికారులు,ప్రజలు కలిసి పనిచేస్తేనే టీబీ రహిత సమాజం సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి