Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:32 PM

టీఆర్‌పీలో భారీ చేరికలు యువతకు రాజకీయ

టీఆర్‌పీలో భారీ చేరికలు యువతకు రాజకీయ

టీఆర్‌పీలో భారీ చేరికలు  యువతకు రాజకీయ
May 23, 2026 05:33 PM 164 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అవకాశాలే పార్టీ లక్ష్యం : వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) బలోపేతానికి యువత ముందుకు వస్తూ పార్టీకి విశేష మద్దతు తెలుపుతున్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమక్షంలో జిల్లా టీఆర్‌పీ యువజన విభాగం అధ్యక్షుడు కోల కరుణాకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పలువురు యువకులు పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణలో బహుజన వర్గాల అభివృద్ధి, యువతకు రాజకీయ అవకాశాలు కల్పించడమే టీఆర్‌పీ లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై యువత స్వచ్ఛందంగా ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు.

జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కోల కరుణాకర్ ముదిరాజ్ మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయడానికి యువతతో కలిసి కృషి చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది యువతను పార్టీ వైపు తీసుకువచ్చి ప్రతి గ్రామంలో టీఆర్‌పీ జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు.

పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ, వట్టే జానయ్య యాదవ్ నాయకత్వం, పార్టీ సిద్ధాంతాలు తమను ఆకట్టుకున్నాయని, ప్రజా సమస్యలపై పోరాడే టీఆర్‌పీతో కలిసి పనిచేయడం గర్వంగా భావిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కొన్నే మంజుల గౌడ్, టీఆర్‌పీ టౌన్ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ఆత్మకూరు(ఎస్) మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, సూర్యాపేట మండల అధ్యక్షుడు సోమగాని లింగస్వామి, వల్లాల సైదులు యాదవ్, నాయి బ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షుడు సైదులు, బోడపట్ల మధు, లింగాల సైదులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News