PRINT TIME: May 26, 2026 07:43 PM
ట్రాఫిక్కు అంతరాయం కలిగించే షాపుల బోర్డుల తొలగింపు
ట్రాఫిక్కు అంతరాయం కలిగించే షాపుల బోర్డుల తొలగింపు
March 14, 2026 07:51 PM
10 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
ఆలేరు:ఆలేరు మున్సిపల్ పరిధిలోని ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న షాపుల ముందు ఏర్పాటు చేసిన బోర్డులను శనివారం మున్సిపల్ అధికారులు పరిశీలించారు.వాహనదారులు,పాదచారులు మరియు ట్రాఫిక్కు అంతరాయం కలిగించే బోర్డులను తొలగించే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ కే.శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపుల యజమానులు రహదారికి అడ్డంగా ఎటువంటి బోర్డులు ఏర్పాటు చేయకుండా ఉండాలని,మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సూచించారు.ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలిపారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ బి.జగన్ మోహన్,శానిటేషన్ సూపర్వైజర్లు పి.ప్రసాద్,ఏ.శివతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి