Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 11:37 AM

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం – ప్రాణాలను కాపాడుకుందాం:సిఐ రేణుక

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం – ప్రాణాలను కాపాడుకుందాం:సిఐ రేణుక

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం – ప్రాణాలను కాపాడుకుందాం:సిఐ రేణుక
23-02-2026 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అల్లాదుర్గం మండల కేంద్రంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. నేషనల్ హైవే 161 పై అల్లాదుర్గం ఎస్సై శంకర్ సమక్షంలో “సెకండ్ పేజ్ అండ్ అలైవ్” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లాదుర్గం సీఐ రేణుక ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు ముఖ్యమైన సూచనలు అందించారు.ఈ సందర్భంగా సీఐ రేణుక మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా హైవేపై ప్రయాణించే వాహనదారులు లైన్ డిసిప్లిన్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. 40, 60, 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనాలు ఆయా లైన్లలోనే ప్రయాణించాల్సిన అవసరాన్ని వివరించారు. సరైన లైన్‌లో ప్రయాణించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి నిర్లక్ష్య చర్యల వల్లే అధిక శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ వాడకపోవడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతుందని అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా మన ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమంలో నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో మంచి చైతన్యం ఏర్పడింది. అందరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణాన్ని అలవాటు చేసుకోవాలని అధికారులు కోరారు.

Sthanikam

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం – ప్రాణాలను కాపాడుకుందాం:సిఐ రేణుక

Article Image

అల్లాదుర్గం మండల కేంద్రంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. నేషనల్ హైవే 161 పై అల్లాదుర్గం ఎస్సై శంకర్ సమక్షంలో “సెకండ్ పేజ్ అండ్ అలైవ్” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లాదుర్గం సీఐ రేణుక ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు ముఖ్యమైన సూచనలు అందించారు.ఈ సందర్భంగా సీఐ రేణుక మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా హైవేపై ప్రయాణించే వాహనదారులు లైన్ డిసిప్లిన్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. 40, 60, 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనాలు ఆయా లైన్లలోనే ప్రయాణించాల్సిన అవసరాన్ని వివరించారు. సరైన లైన్‌లో ప్రయాణించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి నిర్లక్ష్య చర్యల వల్లే అధిక శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ వాడకపోవడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతుందని అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా మన ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమంలో నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో మంచి చైతన్యం ఏర్పడింది. అందరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణాన్ని అలవాటు చేసుకోవాలని అధికారులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News