Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:53 AM

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం – ప్రాణాలను కాపాడుకుందాం:సిఐ రేణుక

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం – ప్రాణాలను కాపాడుకుందాం:సిఐ రేణుక

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం – ప్రాణాలను కాపాడుకుందాం:సిఐ రేణుక
February 23, 2026 06:23 PM 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అల్లాదుర్గం మండల కేంద్రంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. నేషనల్ హైవే 161 పై అల్లాదుర్గం ఎస్సై శంకర్ సమక్షంలో “సెకండ్ పేజ్ అండ్ అలైవ్” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లాదుర్గం సీఐ రేణుక ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు ముఖ్యమైన సూచనలు అందించారు.ఈ సందర్భంగా సీఐ రేణుక మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా హైవేపై ప్రయాణించే వాహనదారులు లైన్ డిసిప్లిన్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. 40, 60, 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనాలు ఆయా లైన్లలోనే ప్రయాణించాల్సిన అవసరాన్ని వివరించారు. సరైన లైన్‌లో ప్రయాణించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి నిర్లక్ష్య చర్యల వల్లే అధిక శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ వాడకపోవడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతుందని అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా మన ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమంలో నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో మంచి చైతన్యం ఏర్పడింది. అందరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణాన్ని అలవాటు చేసుకోవాలని అధికారులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News