Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:28 AM

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాలు బట్టబయలు – 47 కేసులకు పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాలు బట్టబయలు – 47 కేసులకు పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాలు బట్టబయలు – 47 కేసులకు పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్
February 19, 2026 11:08 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

దెందులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన Cr.No.39/2026 U/s 303(2) BNS కేసులో ట్రాన్స్‌ఫార్మర్‌లలోని కాపర్ వైర్ల దొంగతనాలకు పాల్పడిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 12/13-02-2026 మధ్య రాత్రి దెందులూరు మండలంలోని అప్పారావుపాలెం, గాలాయగూడెం గ్రామాల్లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు దొంగిలించబడినట్లు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టైన వారిలో గోడ కార్తీక్ (23), వేల్పుల మణికంఠ @ పిట్ల (ఇతనిపై గతంలో సుమారు 40 కేసులు నమోదైనట్లు సమాచారం), వేల్పుల విష్ణు మోహన్ @ చిన్ని, కోసూరి మురళి, తమటం జాన్ మలాకి, వలముల వెంకట కోటేశ్వరరావు @ కోటి (స్క్రాబ్ వ్యాపారి) ఉన్నారు.

దర్యాప్తులో నిందితులు జిల్లాలోనే కాక ఇతర జిల్లాల్లో కలిపి మొత్తం 47 ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత పోలీస్ స్టేషన్‌లలో కేసుల లింకేజీ ప్రక్రియ కొనసాగుతోంది.

నిందితుల వద్ద నుంచి దొంగిలించిన కాపర్ కాయిల్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయస్థాన కస్టడీకి పంపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News