Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:59 AM

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాలు బట్టబయలు – 47 కేసులకు పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాలు బట్టబయలు – 47 కేసులకు పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాలు బట్టబయలు – 47 కేసులకు పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్
February 19, 2026 11:08 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

దెందులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన Cr.No.39/2026 U/s 303(2) BNS కేసులో ట్రాన్స్‌ఫార్మర్‌లలోని కాపర్ వైర్ల దొంగతనాలకు పాల్పడిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 12/13-02-2026 మధ్య రాత్రి దెందులూరు మండలంలోని అప్పారావుపాలెం, గాలాయగూడెం గ్రామాల్లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు దొంగిలించబడినట్లు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టైన వారిలో గోడ కార్తీక్ (23), వేల్పుల మణికంఠ @ పిట్ల (ఇతనిపై గతంలో సుమారు 40 కేసులు నమోదైనట్లు సమాచారం), వేల్పుల విష్ణు మోహన్ @ చిన్ని, కోసూరి మురళి, తమటం జాన్ మలాకి, వలముల వెంకట కోటేశ్వరరావు @ కోటి (స్క్రాబ్ వ్యాపారి) ఉన్నారు.

దర్యాప్తులో నిందితులు జిల్లాలోనే కాక ఇతర జిల్లాల్లో కలిపి మొత్తం 47 ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత పోలీస్ స్టేషన్‌లలో కేసుల లింకేజీ ప్రక్రియ కొనసాగుతోంది.

నిందితుల వద్ద నుంచి దొంగిలించిన కాపర్ కాయిల్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయస్థాన కస్టడీకి పంపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News