Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:55 PM

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాలు బట్టబయలు – 47 కేసులకు పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాలు బట్టబయలు – 47 కేసులకు పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాలు బట్టబయలు – 47 కేసులకు పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్
February 19, 2026 11:08 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

దెందులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన Cr.No.39/2026 U/s 303(2) BNS కేసులో ట్రాన్స్‌ఫార్మర్‌లలోని కాపర్ వైర్ల దొంగతనాలకు పాల్పడిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 12/13-02-2026 మధ్య రాత్రి దెందులూరు మండలంలోని అప్పారావుపాలెం, గాలాయగూడెం గ్రామాల్లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు దొంగిలించబడినట్లు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టైన వారిలో గోడ కార్తీక్ (23), వేల్పుల మణికంఠ @ పిట్ల (ఇతనిపై గతంలో సుమారు 40 కేసులు నమోదైనట్లు సమాచారం), వేల్పుల విష్ణు మోహన్ @ చిన్ని, కోసూరి మురళి, తమటం జాన్ మలాకి, వలముల వెంకట కోటేశ్వరరావు @ కోటి (స్క్రాబ్ వ్యాపారి) ఉన్నారు.

దర్యాప్తులో నిందితులు జిల్లాలోనే కాక ఇతర జిల్లాల్లో కలిపి మొత్తం 47 ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత పోలీస్ స్టేషన్‌లలో కేసుల లింకేజీ ప్రక్రియ కొనసాగుతోంది.

నిందితుల వద్ద నుంచి దొంగిలించిన కాపర్ కాయిల్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయస్థాన కస్టడీకి పంపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News