ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాలు బట్టబయలు – 47 కేసులకు పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్
ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాలు బట్టబయలు – 47 కేసులకు పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్
GADDAM JAGANMOHAN REDDY
దెందులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన Cr.No.39/2026 U/s 303(2) BNS కేసులో ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్ల దొంగతనాలకు పాల్పడిన గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నెల 12/13-02-2026 మధ్య రాత్రి దెందులూరు మండలంలోని అప్పారావుపాలెం, గాలాయగూడెం గ్రామాల్లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు దొంగిలించబడినట్లు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టైన వారిలో గోడ కార్తీక్ (23), వేల్పుల మణికంఠ @ పిట్ల (ఇతనిపై గతంలో సుమారు 40 కేసులు నమోదైనట్లు సమాచారం), వేల్పుల విష్ణు మోహన్ @ చిన్ని, కోసూరి మురళి, తమటం జాన్ మలాకి, వలముల వెంకట కోటేశ్వరరావు @ కోటి (స్క్రాబ్ వ్యాపారి) ఉన్నారు.
దర్యాప్తులో నిందితులు జిల్లాలోనే కాక ఇతర జిల్లాల్లో కలిపి మొత్తం 47 ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసుల లింకేజీ ప్రక్రియ కొనసాగుతోంది.
నిందితుల వద్ద నుంచి దొంగిలించిన కాపర్ కాయిల్స్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయస్థాన కస్టడీకి పంపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి