ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ గేటు ముందు కార్మికుల ఆందోళన
ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ గేటు ముందు కార్మికుల ఆందోళన
Reporter Sangameshwar Reddy
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం, కోతూరు (బి) గ్రామ శివారు:జహీరాబాద్ మండలంలోని కోతూరు (బి) గ్రామ శివారులో ఉన్న ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ గేటు ముందు మంగళవారం కార్మికులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పరిశ్రమ యాజమాన్యం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో కార్మికులు గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు.
కార్మికుల మాటల ప్రకారం, పరిశ్రమలో ఎన్నేళ్లుగా పని చెస్ఇతున్నాము తర రాష్ట్రాల నుండి కార్మికులతోనే పనులు చేయించుకుంటూ తమ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన వేతనాలు, ఇతర సౌకర్యాలు సరిగా అందడం లేదని తెలిపారు.యాజమాన్యం పదే పదే హామీలు ఇస్తూ సమస్యలను పరిష్కరించకుండా కాలం గడుపుతోందని, దీనివల్ల తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి