సుస్థిర ఆరోగ్యం కోసమే హోమియోపతి వైద్యాన్ని మరింత విస్తృతం చేయాలి: డాక్టర్ శివప్రసాద్
సుస్థిర ఆరోగ్యం కోసమే హోమియోపతి వైద్యాన్ని మరింత విస్తృతం చేయాలి: డాక్టర్ శివప్రసాద్
K.RAVI
రాష్ట్రంలో హోమియోపతి వైద్యాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చినుకని శివప్రసాద్ పిలుపునిచ్చారు. 'ప్రపంచ హోమియో దినోత్సవం' పురస్కరించుకుని ఆయన ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. 2026 ప్రపంచ హోమియో దినోత్సవం యొక్క ఇతివృత్తం "సుస్థిర ఆరోగ్యం కోసం హోమియోపతి" అని ఆయన వెల్లడించారు. హోమియోపతి కేవలం ఒక వైద్య వ్యవస్థ మాత్రమే కాదని, అది ఒక పరిపూర్ణ జీవన విధానమని కొనియాడారు. వేగంగా, సున్నితంగా, శాశ్వతంగా ఆరోగ్యాన్ని చేకూర్చడమే దీని పరమార్థమని తెలిపారు. రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలకు ఈ వైద్యాన్ని చేరువ చేసేందుకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హోమియో విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు హోమియోపతి చికిత్స అందుబాటులో ఉండేలా వైద్యులు అంకితభావంతో పనిచేయాలని డాక్టర్ శివప్రసాద్ సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి