సూర్యాపేటలో వార్డు సభలు నిర్వహణ
సూర్యాపేటలో వార్డు సభలు నిర్వహణ
Biksham
సూర్యాపేట పట్టణంలోని 33, 44, 47 వార్డుల్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, వైస్ చైర్మన్ యండి షఫీ ఉల్లా, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హన్మంతరెడ్డి, పట్టణ సిఐ వెంకటయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యల పరిష్కారంపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి, వార్డు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 47వ వార్డు కౌన్సిలర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, 33వ వార్డు కౌన్సిలర్ నాగుల వాసు, 44వ వార్డు కౌన్సిలర్ గుణగంటి హేమ సతీష్, 31వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి