సూర్యాపేటలో డ్రైనేజీ పనులపై నిర్లక్ష్యం… కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి
సూర్యాపేటలో డ్రైనేజీ పనులపై నిర్లక్ష్యం… కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి
Biksham
సూర్యాపేట పట్టణంలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని సి.పి.ఐ (ఎం-ఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కమిటీ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలో చేపడుతున్న డ్రైనేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయని, తవ్విన రోడ్లను సకాలంలో పూడ్చకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎక్కడికక్కడ గుంతలు, దుమ్ము కారణంగా రాకపోకలు కష్టతరమవుతున్నాయని, ప్రమాదాలకు కూడా అవకాశం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని, పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి