సూర్యాపేటలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా
సూర్యాపేటలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా
Biksham
మహారాష్ట్ర గర్వకారణుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం నుండి ఛత్రపతి శివాజీ విగ్రహంతో భక్తి గీతాలు, నృత్యాలతో భారీ ఊరేగింపును నిర్వహించారు. పురవీధుల గుండా సాగిన ఈ ర్యాలీ కోర్టు చౌరస్తా వద్ద ముగిసింది. ఈ సందర్భంగా నాయకులు శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్యసాహసాలు యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. శివాజీ ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో ఐక్యత, స్ఫూర్తి పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కారింగుల ఉపేందర్ గౌడ్, పున్నం సందీప్, కాసర్ల శ్రీకాంత్, దినేష్ బాబు, విజయ్ కృష్ణ, చంద్రశేఖర్, చల్లమల్ల నరసింహ, శివ తదితరులు పాల్గొన్నారు. జయంతి వేడుకల సందర్భంగా శివాజీ మహారాజ్కు ఘనంగా నివాళులు అర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి