Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 06:27 PM

సూర్యాపేటలో అభివృద్ధి యజ్ఞం ప్రారంభం

సూర్యాపేటలో అభివృద్ధి యజ్ఞం ప్రారంభం

సూర్యాపేటలో అభివృద్ధి యజ్ఞం ప్రారంభం
February 23, 2026 05:13 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

50 లక్షలతో నాలా కల్వర్టు, సిమెంట్ రహదారులకు శంకుస్థాపన

సూర్యాపేట పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సూర్యాపేట మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నిధులకు వెనుకడకుండా, నాణ్యతలో రాజీపడకుండా పనులు చేపడుతున్నామని ప్రజాప్రతినిధులు తెలిపారు. అందరి భాగస్వామ్యంతో భవిష్యత్తు తరాలకు అందమైన పట్టణాన్ని అందిద్దామని పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని అరవై అడుగుల రహదారిలో నాలా కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నలభై ఆరు, నలభై ఏడు వార్డుల్లో మొత్తం యాభై లక్షల రూపాయల వ్యయంతో నాలా కల్వర్టు, సిమెంట్ రహదారి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఈ పనులు రెండు నెలల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్వర్టు లేకపోవడంతో ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు మరియు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. త్వరితగతిన భూగర్భ మురుగు కాలువల నిర్మాణ పనులు కూడా పూర్తి చేస్తామని వెల్లడించారు. పారిశుద్ధ్య పనులు ప్రణాళికాబద్ధంగా కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రిని కలసి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరనున్నట్లు తెలిపారు. మంత్రులు ఉత్తమన్న, లక్ష్మణ్ కుమార్, పార్లమెంట్ సభ్యుడు రఘువీర్ రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధి వేగవంతం అవుతోందన్నారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వెనుక వీధిలో, సీపీఎం పార్టీ కార్యాలయం వెనుక వీధిలో సిమెంట్ రహదారి నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డు ముఖ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News