Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:51 PM

సూర్యఘర్ పథకంతో ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక ఊతం

సూర్యఘర్ పథకంతో ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక ఊతం

సూర్యఘర్ పథకంతో ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక ఊతం
April 07, 2026 07:27 PM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

(శ్రీ సత్యసాయి జిల్లా) సోమందేపల్లి: ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ‘ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన’ పథకం దోహదం చేస్తుందని రాష్ట్ర మంత్రి సవిత తెలిపారు. సోమందేపల్లి మండలం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌ను ఆమె ప్రారంభించారు.

ఈ పథకం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని, నియోజకవర్గంలో 2514 మందికి, మండలంలో 600 మందికి సోలార్ ప్యానెల్లు అందజేయనున్నట్లు తెలిపారు. మిగులు విద్యుత్ విక్రయం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు.

అధికారులు పథకం ప్రయోజనాలు పూర్తిగా చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News