(శ్రీ సత్యసాయి జిల్లా) సోమందేపల్లి: ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ‘ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన’ పథకం దోహదం చేస్తుందని రాష్ట్ర మంత్రి సవిత తెలిపారు. సోమందేపల్లి మండలం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ను ఆమె ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని, నియోజకవర్గంలో 2514 మందికి, మండలంలో 600 మందికి సోలార్ ప్యానెల్లు అందజేయనున్నట్లు తెలిపారు. మిగులు విద్యుత్ విక్రయం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు.
అధికారులు పథకం ప్రయోజనాలు పూర్తిగా చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి