Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోంగార్డ్ కుటుంబానికి రూ. 34 లక్షల బీమా చెక్కు చోలేమరి జాతరలో పాల్గొన్న మంత్రి సవిత “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” దారులేసిన దార్శనికుడు ఫూలే: బహుజన ఉద్యమాల మూలస్తంభం జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 07, 2026 09:02 PM

సూర్యఘర్ పథకంతో ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక ఊతం

సూర్యఘర్ పథకంతో ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక ఊతం

సూర్యఘర్ పథకంతో ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక ఊతం
April 07, 2026 07:27 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

(శ్రీ సత్యసాయి జిల్లా) సోమందేపల్లి: ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ‘ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన’ పథకం దోహదం చేస్తుందని రాష్ట్ర మంత్రి సవిత తెలిపారు. సోమందేపల్లి మండలం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌ను ఆమె ప్రారంభించారు.

ఈ పథకం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని, నియోజకవర్గంలో 2514 మందికి, మండలంలో 600 మందికి సోలార్ ప్యానెల్లు అందజేయనున్నట్లు తెలిపారు. మిగులు విద్యుత్ విక్రయం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు.

అధికారులు పథకం ప్రయోజనాలు పూర్తిగా చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News