సుమారు 170 గ్రాముల ఎండిన గంజాయి
సుమారు 170 గ్రాముల ఎండిన గంజాయి
Sthanikam District Staff Reporter
- సుమారు 2.400 గ్రాములు మత్తు పదార్థం స్వాధీనం నిందితుడిని అరెస్ట్
- జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి(డీపీఈఓ) ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం భువనగిరి పట్టణ పరిధిలో ప్రత్యేక నిఘా నిర్వహించుచుండగా, భువనగిరి పట్టణంలోని ఇంటి నెంబర్: 3-9-27, స్థానిక 24వ వార్డు వద్ద గంజాయి విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. పట్టుబడిన నిందితుడి పేరు సనౌల్ షేక్,తండ్రి:సదుల్ షేక్. ఇతను ముహబ్బత్పూర్,దుఇసతాబిఘి గ్రామం,మాల్దా జిల్లా,వెస్ట్ బెంగాల్ (పిన్ కోడ్:732201)కు చెందిన వ్యక్తి ఈ
నిందితుడి వద్ద నుండి మొత్తం సుమారు 170 గ్రాముల ఎండిన గంజాయి మరియు మత్తు పదార్థంలా అనుమానిస్తున్న గుర్తు తెలియని పదార్థం సుమారు 2.400 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నిందితుడిపై యన్.డీ.పీ.ఎస్ చట్టం -1985 ప్రకారం కేసు నమోదు చేయబడింది. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి 35 రోజుల రిమాండ్ కోరడమైనది. నిందితుడిని మంగళవారం రోజు కోర్టులో హాజరు,పరచడం జరిగింది.జిల్లా ప్రజలు మత్తు పదార్థాల వినియోగం మరియు అక్రమ రవాణా గురించి సమాచారం ఉన్నచో ఎక్సైజ్ శాఖకు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి