Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:30 PM

సుంకేనపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం – రూ.10 లక్షల సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

సుంకేనపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం – రూ.10 లక్షల సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

సుంకేనపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం – రూ.10 లక్షల సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
March 17, 2026 06:26 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని సుంకేనపల్లి గ్రామంలో మంగళవారం అభివృద్ధి పనుల సందడి నెలకొంది. ఉపాధి హామీ పథకం (NRGS ) నిధులతో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య యాదవ్ ఘనంగా భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ఈ అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ పనులకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో గ్రామస్తులు ఎదుర్కొంటున్న రాకపోకల ఇబ్బందులు ఈ సీసీ రోడ్డుతో తొలగిపోతాయని, రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని వివరించారు.రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దశలవారీగా మౌలిక వసతులు కల్పిస్తూ సుంకేనపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మౌనిక, వార్డు సభ్యురాలు ఆవుల సోనీతో పాటు మచ్చ గిరి, నాగవచారి, లింగస్వామి, లింగం తదితరులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News