Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:46 PM

సుందరయ్య ఆశయాలను సాధిస్తాం: సీపీఎం

సుందరయ్య ఆశయాలను సాధిస్తాం: సీపీఎం

సుందరయ్య ఆశయాలను సాధిస్తాం: సీపీఎం
May 19, 2026 02:14 PM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఘనంగా ‘కమ్యూనిస్టు గాంధీ’ 41వ వర్ధంతి

భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, స్వాతంత్ర్య సమరయోధుడు, ‘కమ్యూనిస్టు గాంధీ’గా ప్రసిద్ధి చెందిన పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం చౌటుప్పల కమిటీల ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా బూరుగు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సుందరయ్య జీవితం పీడిత ప్రజల విముక్తికి, సామ్యవాద స్థాపనకు అంకితమైందని కొనియాడారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయనే పునాది వేశారని గుర్తుచేశారు. భూ పోరాటాలు, వ్యవసాయ కార్మికుల ఐక్యత, అంటరానితనంపై పోరాటంలో సుందరయ్య పాత్ర అజరామరమని అన్నారు. నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని, సాయుధ దళాలకు ఆయనే స్వయంగా నాయకత్వం వహించారని స్పష్టం చేశారు.​"నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, పేదల సమస్యలపై చట్టసభలలో గళమెత్తిన గొప్ప ప్రజా నాయకుడు సుందరయ్య. ఆయన చూపిన బాటలో నడుస్తూ, ఆశయాల సాధన కోసం సీపీఎం నిరంతరం పనిచేస్తుంది."​ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ. పాషా, మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, నాయకులు బత్తుల దాసు, బొడ్డు అంజిరెడ్డి, సప్పిడి శ్రీనివాసరెడ్డి, భావనలపల్లి స్వామి, రమేష్, ఆకుల ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News