Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సతీష్‌నగర్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు..భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం సీఎం, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో సభా వేదిక, భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 12, 2026 09:18 PM

సోషల్ మీడియాలో దూషణలపై చర్యలు తీసుకోవాలి. పట్టణ సీఐకి ముదిరాజ్ మహాసభ ఫిర్యాదు

సోషల్ మీడియాలో దూషణలపై చర్యలు తీసుకోవాలి. పట్టణ సీఐకి ముదిరాజ్ మహాసభ ఫిర్యాదు

సోషల్ మీడియాలో దూషణలపై చర్యలు తీసుకోవాలి. పట్టణ సీఐకి ముదిరాజ్ మహాసభ ఫిర్యాదు
May 12, 2026 08:17 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని సోషల్‌మీడియాలో పరువునష్టం కలిగించేలా పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ మహాసభ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం భువనగిరి పట్టణ సీఐ రమేష్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మహాసభ జిల్లా అధ్యక్షుడు కొలుపుల హరినాథ్‌, ప్రధాన కార్యదర్శి సాదు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. నాగర్‌కర్నూలు జిల్లా కోనేటిపూర్‌కు చెందిన నూకం జాన్ ముదిరాజ్‌, వనపర్తి జిల్లా మనుగిల్ల గ్రామానికి చెందిన వై.శివ ముదిరాజ్‌, అల్లదుర్గం సురేష్‌లు సోషల్‌మీడియా వేదికగా ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌, ఎంపీ ఈటల రాజేందర్‌, మంత్రి వాకిటి శ్రీహరిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

వీరితో పాటు వారి కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకరమైన, బెదిరింపు వ్యాఖ్యలతో కూడిన కంటెంట్‌ను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నూకం జాన్ అలియాస్‌ నాని ‘జనతా న్యూస్‌ ఆప్‌’, ‘ముదిరాజ్‌ హిస్టరీ టీవీ’ సీఈఓగా వ్యవహరిస్తూ ముదిరాజ్‌ కమ్యూనిటీ నాయకులపై అవమానకర భాష ఉపయోగిస్తున్నాడని ఆరోపించారు.

ఇతనిపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెంట నర్సింహా, కన్వీనర్‌ ఉడుత భాస్కర్‌, జిల్లా నాయకులు పిట్టల బాలరాజు, కనక బాలరాజు, బోయిని బాలయ్య, పిట్టల రాములు, ఇట్టబోయిన గోపాల్‌, ఎనబోయిన జహంగీర్‌, గీస కొండల్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News