Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:19 AM

సోషల్ మీడియాలో దూషణలపై చర్యలు తీసుకోవాలి. పట్టణ సీఐకి ముదిరాజ్ మహాసభ ఫిర్యాదు

సోషల్ మీడియాలో దూషణలపై చర్యలు తీసుకోవాలి. పట్టణ సీఐకి ముదిరాజ్ మహాసభ ఫిర్యాదు

సోషల్ మీడియాలో దూషణలపై చర్యలు తీసుకోవాలి. పట్టణ సీఐకి ముదిరాజ్ మహాసభ ఫిర్యాదు
12-05-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని సోషల్‌మీడియాలో పరువునష్టం కలిగించేలా పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ మహాసభ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం భువనగిరి పట్టణ సీఐ రమేష్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మహాసభ జిల్లా అధ్యక్షుడు కొలుపుల హరినాథ్‌, ప్రధాన కార్యదర్శి సాదు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. నాగర్‌కర్నూలు జిల్లా కోనేటిపూర్‌కు చెందిన నూకం జాన్ ముదిరాజ్‌, వనపర్తి జిల్లా మనుగిల్ల గ్రామానికి చెందిన వై.శివ ముదిరాజ్‌, అల్లదుర్గం సురేష్‌లు సోషల్‌మీడియా వేదికగా ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌, ఎంపీ ఈటల రాజేందర్‌, మంత్రి వాకిటి శ్రీహరిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

వీరితో పాటు వారి కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకరమైన, బెదిరింపు వ్యాఖ్యలతో కూడిన కంటెంట్‌ను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నూకం జాన్ అలియాస్‌ నాని ‘జనతా న్యూస్‌ ఆప్‌’, ‘ముదిరాజ్‌ హిస్టరీ టీవీ’ సీఈఓగా వ్యవహరిస్తూ ముదిరాజ్‌ కమ్యూనిటీ నాయకులపై అవమానకర భాష ఉపయోగిస్తున్నాడని ఆరోపించారు.

ఇతనిపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెంట నర్సింహా, కన్వీనర్‌ ఉడుత భాస్కర్‌, జిల్లా నాయకులు పిట్టల బాలరాజు, కనక బాలరాజు, బోయిని బాలయ్య, పిట్టల రాములు, ఇట్టబోయిన గోపాల్‌, ఎనబోయిన జహంగీర్‌, గీస కొండల్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సోషల్ మీడియాలో దూషణలపై చర్యలు తీసుకోవాలి. పట్టణ సీఐకి ముదిరాజ్ మహాసభ ఫిర్యాదు

Article Image

భువనగిరి: ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని సోషల్‌మీడియాలో పరువునష్టం కలిగించేలా పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ మహాసభ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం భువనగిరి పట్టణ సీఐ రమేష్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మహాసభ జిల్లా అధ్యక్షుడు కొలుపుల హరినాథ్‌, ప్రధాన కార్యదర్శి సాదు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. నాగర్‌కర్నూలు జిల్లా కోనేటిపూర్‌కు చెందిన నూకం జాన్ ముదిరాజ్‌, వనపర్తి జిల్లా మనుగిల్ల గ్రామానికి చెందిన వై.శివ ముదిరాజ్‌, అల్లదుర్గం సురేష్‌లు సోషల్‌మీడియా వేదికగా ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌, ఎంపీ ఈటల రాజేందర్‌, మంత్రి వాకిటి శ్రీహరిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

వీరితో పాటు వారి కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకరమైన, బెదిరింపు వ్యాఖ్యలతో కూడిన కంటెంట్‌ను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నూకం జాన్ అలియాస్‌ నాని ‘జనతా న్యూస్‌ ఆప్‌’, ‘ముదిరాజ్‌ హిస్టరీ టీవీ’ సీఈఓగా వ్యవహరిస్తూ ముదిరాజ్‌ కమ్యూనిటీ నాయకులపై అవమానకర భాష ఉపయోగిస్తున్నాడని ఆరోపించారు.

ఇతనిపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెంట నర్సింహా, కన్వీనర్‌ ఉడుత భాస్కర్‌, జిల్లా నాయకులు పిట్టల బాలరాజు, కనక బాలరాజు, బోయిని బాలయ్య, పిట్టల రాములు, ఇట్టబోయిన గోపాల్‌, ఎనబోయిన జహంగీర్‌, గీస కొండల్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News