సొసైటీ తాళాలు పగలగొట్టి దొంగతనం చేసిన ముద్దాయి అరెస్ట్
సొసైటీ తాళాలు పగలగొట్టి దొంగతనం చేసిన ముద్దాయి అరెస్ట్
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును చాట్రాయి పోలీసులు విజయవంతంగా ఛేదించారు.నరసింహారావుపాలెం గ్రామ సొసైటీలో తాళాలు పగలగొట్టి లోపల ఉన్న బీరువాను తెరిచి అందులోని నగదును దొంగతనం చేసిన ముద్దాయిని చాట్రాయి పోలీసులు అరెస్ట్ చేశారు.
ముద్దాయి వివరాలు:నక్క గంగాధర్ రావు, తండ్రి రత్తయ్య, వయస్సు 34 సంవత్సరాలు, నరసింహారావుపాలెం గ్రామము, చాట్రాయి మండలం. నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో చాట్రాయి ఎస్.ఐ డి. రామకృష్ణ మరియు వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అనుమానితుల కదలికలపై పూర్తి స్థాయి నిఘా ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో ముద్దాయిని ఈ రోజు పట్టుకోవడం జరిగినది. ముద్దాయి వద్ద నుండి దొంగిలించిన 1,40,000/రూపాయల నగదును స్వాధీన పరచుకొని ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి నట్లు చాట్రాయి ఎస్సై డి.రామకృష్ణ తెలియజేశారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి