సూర్యాపేట మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడం జరిగింది
సూర్యాపేట మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడం జరిగింది
Biksham
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.జిల్లా సమీకృత కార్యాలయ సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో సూర్యాపేట, కోదాడ,హుజూర్నగర్,నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల పరిధిలోని 141 వార్డులకు ఆయన రిజర్వేషన్ ప్రక్రియను శనివారం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వార్డుల వారీగా రిజర్వేషన్లు కేటాయించామని గత ఎన్నికల రిజర్వేషన్ , ఎస్ టి, ఎస్ సి, బి సి జనాభా లెక్కలు, రొటేషన్ విధానం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు అష్కారం లేకుండా రాజకీయ పార్టీ ప్రతినిధుల మధ్య రిజర్వేషన్లను పారదర్శకంగా ప్రకటించటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కే సీతారామారావు,మున్సిపల్ కమిషనర్లు హన్మంతరెడ్డి, రమాదేవి, శ్రీనివాస్ రెడ్డి, ఆశోక్ రెడ్డి, మున్వర్ పాషా, రాజకీయ పార్టీ ప్రతినిధులు,అధికారులు, సిబ్బంది,హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి