సూర్యాపేట 28వ వార్డులో సంక్రాంతి సంబరాలు
సూర్యాపేట 28వ వార్డులో సంక్రాంతి సంబరాలు
Biksham Goud
పతంగులు ఎగురవేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
సూర్యాపేట జిల్లా స్థానిక ప్రతినిధి బిక్షం
సూర్యాపేట పట్టణంలోని 28వ వార్డులో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యం.డి. అంజద్ అలి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పతంగులు ఎగురవేసి సంబరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే మహత్తర పండుగ అని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. పట్టణంలో ప్రతి వార్డులో ఇలాంటి సంబరాలు జరగడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పతంగుల పండుగను ఆనందంగా జరుపుకున్నారు. సంక్రాంతి పాటలు, ఆటపాటలతో వార్డు మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి