Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:25 PM

సూరంపాలెం లో పోలీస్ అవగాహనా కార్యక్రమం నిర్వహించిన సీఐ కె.రామకృష్ణ, ఎస్సై డి రామకృష్ణ

సూరంపాలెం లో పోలీస్ అవగాహనా కార్యక్రమం నిర్వహించిన సీఐ కె.రామకృష్ణ, ఎస్సై డి రామకృష్ణ

సూరంపాలెం లో పోలీస్ అవగాహనా కార్యక్రమం నిర్వహించిన సీఐ కె.రామకృష్ణ, ఎస్సై డి రామకృష్ణ
January 11, 2026 05:41 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 11 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి నూజివీడు డిఎస్పి కె వి వి ఎన్ వి ప్రసాద్ యొక్క ఆదేశాల పై నూజివీడు రూరల్ సిఐ కె రామకృష్ణ ఆధ్వర్యములో చాట్రాయి ఎస్ఐ డి రామకృష్ణ తమ సిబ్బందితో కలిసి చాట్రాయి మండలం సూరంపాలెం గ్రామ పరిధిలో విస్తృతమైన విజిబుల్ పోలీసింగ్, హెల్మెట్, సైబర్ నేరాలకు డయల్ 112 పై అవగాహనను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణా పాయం నుండి రక్షణ పొందవచ్చని ఆయన తెలిపారు.అలాగే, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలని, అతివేగంగా వాహనాలు నడపరాదని హితవు పలికారు. "వేగం వద్దు ప్రాణం ముద్దు" అనే నినాదాన్ని గుర్తుంచు కోవాలని ఆయన కోరారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని ఆయన అన్నారు.విజిబుల్ పోలీసింగ్ సందర్భంగా ప్రజలకు సైబర్ క్రైమ్ పై జాగ్రత్తలను సైబర్ నేరగాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా మీ యొక్క డబ్బులు కాపాడుకోవాలని ఎవ్వరైనా సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే 1930 కు సమాచారం అందించాలని సమాచారం అందించిన ఎడల వారు సహాయ సహకారాలు అందిస్తారని, అత్యవసర సమయాలలో ప్రజలు డయల్ 112 కు సమాచారం అందించి పోలీసు వారి యొక్క సహాయాన్ని పొందవచ్చునని విషయాలపై అవగాహనను కల్పించినారు మైనర్ల కు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే నష్టాలను వారికి వివరించి ఎవ్వరైనా మైనర్ లకు ద్విచక్ర వాహనం ఇస్తే వారి రక్త బంధువులపై కూడా చర్యలు తీసుకుంటామని,ఈ విజిబుల్ పోలీసింగ్ మరియు అవగాహన కార్యక్రమం ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడానికి మరియు నేరాలను నివారించడానికి దోహదం చేస్తుందని ఇన్స్పెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.ద్విచక్ర వాహనాలు నడిపే సమయాలలో మీ కుటుంబ సభ్యులు మీపై ఆధారపడి ఉన్నారని విషయాన్ని గుర్తుంచుకోవాలని సురక్షితమైనటు వంటి ప్రయాణాన్ని చేసి సురక్షితముగా గమ్యస్థానాలకు చేరాలని ఇన్స్పెక్టర్ వాహనదారులకు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News