Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మణికంఠనగర్‌లో వైభవంగా మద్దెలమ్మ బోనాలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:04 PM

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2026 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist


వేడుకల్లో పాల్గొన్న కొప్పుల వైణరెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వైణరెడ్డి, ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకలకు ముందు మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, అదే రోజున భారత్ ఒక గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడిందని పేర్కొన్నారు.

గణతంత్ర దినోత్సవం కేవలం హక్కుల పండుగ మాత్రమే కాదని, బాధ్యతల పండుగ కూడా అని అన్నారు. దేశాభివృద్ధిలో పాలుపంచుకోవడం, చట్టాలను గౌరవించడం, ఐక్యతగా ఉండటం ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యమని పేర్కొన్నారు. భారత్ విభిన్న సంస్కృతులకు నెలవని, ఈ భిన్నత్వంలో ఏకత్వమే దేశ బలం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మార్కెట్ కార్యదర్శి ఎండి. ఫసియోద్దీన్, మార్కెట్ డైరెక్టర్లు, కమిషన్ దారులు, ఖరీదారులు, పుర ప్రముఖులు, రైతులు, గుమస్తాలు, హమాలీలు, దడువాయులు, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image


వేడుకల్లో పాల్గొన్న కొప్పుల వైణరెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వైణరెడ్డి, ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకలకు ముందు మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, అదే రోజున భారత్ ఒక గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడిందని పేర్కొన్నారు.

గణతంత్ర దినోత్సవం కేవలం హక్కుల పండుగ మాత్రమే కాదని, బాధ్యతల పండుగ కూడా అని అన్నారు. దేశాభివృద్ధిలో పాలుపంచుకోవడం, చట్టాలను గౌరవించడం, ఐక్యతగా ఉండటం ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యమని పేర్కొన్నారు. భారత్ విభిన్న సంస్కృతులకు నెలవని, ఈ భిన్నత్వంలో ఏకత్వమే దేశ బలం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మార్కెట్ కార్యదర్శి ఎండి. ఫసియోద్దీన్, మార్కెట్ డైరెక్టర్లు, కమిషన్ దారులు, ఖరీదారులు, పుర ప్రముఖులు, రైతులు, గుమస్తాలు, హమాలీలు, దడువాయులు, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News