Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:55 AM

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
January 26, 2026 01:09 PM 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram


వేడుకల్లో పాల్గొన్న కొప్పుల వైణరెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వైణరెడ్డి, ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకలకు ముందు మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, అదే రోజున భారత్ ఒక గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడిందని పేర్కొన్నారు.

గణతంత్ర దినోత్సవం కేవలం హక్కుల పండుగ మాత్రమే కాదని, బాధ్యతల పండుగ కూడా అని అన్నారు. దేశాభివృద్ధిలో పాలుపంచుకోవడం, చట్టాలను గౌరవించడం, ఐక్యతగా ఉండటం ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యమని పేర్కొన్నారు. భారత్ విభిన్న సంస్కృతులకు నెలవని, ఈ భిన్నత్వంలో ఏకత్వమే దేశ బలం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మార్కెట్ కార్యదర్శి ఎండి. ఫసియోద్దీన్, మార్కెట్ డైరెక్టర్లు, కమిషన్ దారులు, ఖరీదారులు, పుర ప్రముఖులు, రైతులు, గుమస్తాలు, హమాలీలు, దడువాయులు, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News