Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:17 PM

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
January 26, 2026 01:09 PM 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist


వేడుకల్లో పాల్గొన్న కొప్పుల వైణరెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వైణరెడ్డి, ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకలకు ముందు మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, అదే రోజున భారత్ ఒక గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడిందని పేర్కొన్నారు.

గణతంత్ర దినోత్సవం కేవలం హక్కుల పండుగ మాత్రమే కాదని, బాధ్యతల పండుగ కూడా అని అన్నారు. దేశాభివృద్ధిలో పాలుపంచుకోవడం, చట్టాలను గౌరవించడం, ఐక్యతగా ఉండటం ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యమని పేర్కొన్నారు. భారత్ విభిన్న సంస్కృతులకు నెలవని, ఈ భిన్నత్వంలో ఏకత్వమే దేశ బలం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మార్కెట్ కార్యదర్శి ఎండి. ఫసియోద్దీన్, మార్కెట్ డైరెక్టర్లు, కమిషన్ దారులు, ఖరీదారులు, పుర ప్రముఖులు, రైతులు, గుమస్తాలు, హమాలీలు, దడువాయులు, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News