Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:51 PM

సూర్యాపేట రాజకీయాల్లో పెను సంచలనం

సూర్యాపేట రాజకీయాల్లో పెను సంచలనం

సూర్యాపేట రాజకీయాల్లో పెను సంచలనం
February 08, 2026 06:05 PM 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బీజేపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా సామాన్య మహిళ వీరవెల్లి ఉమ ప్రకటన

సూర్యాపేట పట్టణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయంతో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అధికారమే లక్ష్యంగా కాకుండా సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తూ, బీజేపీ మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా 40వ వార్డు నుంచి పోటీ చేస్తున్న సామాన్య మహిళ వీరవెల్లి ఉమను ప్రకటించారు.

వీరవెల్లి ఉమ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన నిరుపేద మహిళ. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా, ఆమె సేవాభావాన్ని గుర్తించిన బీజేపీ, ఆమెకు అత్యున్నత బాధ్యత అప్పగిస్తూ చైర్‌పర్సన్ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఈ నిర్ణయం పట్టణ రాజకీయాల్లో విస్తృత చర్చకు దారి తీసింది.ఈ సందర్భంగా 40వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, డబ్బు సంచులతో రాజకీయాలు చేసే రోజులు ముగిశాయని స్పష్టం చేశారు. పేదరికం నుంచి వచ్చిన ఒక మహిళను మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠంపై కూర్చోబెట్టడమే బీజేపీ లక్ష్యమని, తద్వారా అభివృద్ధిని సామాన్యుడి ముంగిటకు తీసుకెళ్తామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పదవికి అవసరమైన మెజారిటీ స్థానాలను బీజేపీ సొంతంగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో 40వ వార్డు ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీని శాసించే అవకాశం తమ వార్డుకు, అది కూడా పేదింటి మహిళకు దక్కిందని గుర్తుచేశారు. డబ్బు, ప్రలోభాలు, రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా తమ ఆడబిడ్డ వీరవెల్లి ఉమను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఆమెను ఎన్నుకొని అభివృద్ధిలో భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News