సూర్యాపేట రాజకీయాల్లో పెను సంచలనం
సూర్యాపేట రాజకీయాల్లో పెను సంచలనం
Biksham
బీజేపీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా సామాన్య మహిళ వీరవెల్లి ఉమ ప్రకటన
సూర్యాపేట పట్టణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయంతో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అధికారమే లక్ష్యంగా కాకుండా సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తూ, బీజేపీ మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా 40వ వార్డు నుంచి పోటీ చేస్తున్న సామాన్య మహిళ వీరవెల్లి ఉమను ప్రకటించారు.
వీరవెల్లి ఉమ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన నిరుపేద మహిళ. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా, ఆమె సేవాభావాన్ని గుర్తించిన బీజేపీ, ఆమెకు అత్యున్నత బాధ్యత అప్పగిస్తూ చైర్పర్సన్ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఈ నిర్ణయం పట్టణ రాజకీయాల్లో విస్తృత చర్చకు దారి తీసింది.ఈ సందర్భంగా 40వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, డబ్బు సంచులతో రాజకీయాలు చేసే రోజులు ముగిశాయని స్పష్టం చేశారు. పేదరికం నుంచి వచ్చిన ఒక మహిళను మున్సిపల్ చైర్పర్సన్ పీఠంపై కూర్చోబెట్టడమే బీజేపీ లక్ష్యమని, తద్వారా అభివృద్ధిని సామాన్యుడి ముంగిటకు తీసుకెళ్తామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పదవికి అవసరమైన మెజారిటీ స్థానాలను బీజేపీ సొంతంగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో 40వ వార్డు ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీని శాసించే అవకాశం తమ వార్డుకు, అది కూడా పేదింటి మహిళకు దక్కిందని గుర్తుచేశారు. డబ్బు, ప్రలోభాలు, రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా తమ ఆడబిడ్డ వీరవెల్లి ఉమను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్గా ఆమెను ఎన్నుకొని అభివృద్ధిలో భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి