Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:50 PM

సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి

సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి

సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి
February 01, 2026 06:56 PM 185 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం: ఏఐసీసీ ఇంచార్జి సెక్రటరీ విశ్వనాథన్

సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కైవసం చేసుకోవాలని ఏఐసీసీ ఇంచార్జి సెక్రటరీ విశ్వనాథన్ పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికలపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు.డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాట్లాడుతూ, నాయకులంతా ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతుంటే సూర్యాపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. నాయకుల ఐక్యతను చూస్తే తప్పకుండా మున్సిపాలిటీ గెలుస్తామనే పూర్తి నమ్మకం కలుగుతోందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, అనుములపురి రవిబాబు, ఓబీసీ సెల్ వైస్ చైర్మన్ తండు శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమళ్ళ రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు యండి అంజద్ అలి, నాయకులు పెద్దిరెడ్డి రాజా, ముదిరెడ్డి రమణారెడ్డి, షఫీ ఉల్లా, గట్టు శ్రీనివాస్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News