Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:25 AM

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలు మొదటి రోజు పదమూడు నామినేషన్ల దాఖలు

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలు మొదటి రోజు పదమూడు నామినేషన్ల దాఖలు

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలు మొదటి రోజు పదమూడు నామినేషన్ల దాఖలు
January 28, 2026 06:46 PM 153 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తొలి రోజు బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తం పదమూడు నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్, సహాయ జిల్లా ఎన్నికల అధికారి సిహెచ్ హన్మంత రెడ్డి తెలిపారు.

వివరాల ప్రకారం

ఇరవై ఆరవ వార్డు నుంచి పోలేబోయిన రాధిక కాంగ్రెస్ పార్టీ తరఫున,

ముప్పై తొమ్మిదవ వార్డు నుంచి గడ్డం భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీ తరఫున,

నలభై మూడవ వార్డు నుంచి బత్తుల ఝాన్సీ లక్ష్మి రమేష్ తెరాస పార్టీ తరఫున,

తొమ్మిదవ వార్డు నుంచి వల్దాస్ భవాని బహుజన సమాజ్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు.

నలభై ఎనిమిదవ వార్డు నుంచి కొండా కిషోర్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా,

పద్దెనిమిదవ వార్డు నుంచి వాంకుడోతు శ్రీను స్వతంత్ర అభ్యర్థిగా,

పందొమ్మిదవ వార్డు నుంచి నూక పెయ్యి పుష్పలత తెరాస పార్టీ తరఫున,

ముప్పై రెండవ వార్డు నుంచి సైదులు రత్నావత్ తెరాస పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు.

పదవ వార్డు నుంచి దామెర మహేశ్వరి బహుజన సమాజ్ పార్టీ తరఫున,

ముప్పై ఎనిమిదవ వార్డు నుంచి వై ఎల్ యెన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తరఫున,

అదే వార్డు నుంచి గండూరి రమేష్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు.

ఇరవై ఐదవ వార్డు నుంచి ఆకుల కవిత తెరాస పార్టీ తరఫున,

అదే వార్డు నుంచి శ్రీదేవి యాట కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

మున్సిపల్ కార్యాలయం వద్ద నామినేషన్ల సందర్భంగా సందడి నెలకొందని అధికారులు తెలిపారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News