సూర్యాపేట గడ్డపై రాజ్యాధికార శంఖారావం
సూర్యాపేట గడ్డపై రాజ్యాధికార శంఖారావం
Biksham
ఫిబ్రవరి 8న తెలంగాణ రాజ్యాధికార పార్టీ భారీ బహిరంగ సభ
ముఖ్య అతిథిగా తీన్మార్ మల్లన్న హాజరు
రాజ్యాధికార సాధనే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ శ్రీ వట్టె జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని పాత రామలింగేశ్వర థియేటర్ స్థలంలో ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సభకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించనున్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలంతా పెద్ద సంఖ్యలో హాజరై ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.సభా ఏర్పాట్లను పరిశీలించిన వట్టె జానయ్య యాదవ్ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సభను చరిత్రలో నిలిచేలా విజయవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య , ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్ , పట్టణ అధ్యక్షులు కుంభం నాగరాజు , నెలచర్ల మధు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి