సోమందేపల్లిలో టీటీడీ చైర్మన్పై వైఎస్ఆర్సిపి నిరసన, ప్రత్యేక పూజలు
సోమందేపల్లిలో టీటీడీ చైర్మన్పై వైఎస్ఆర్సిపి నిరసన, ప్రత్యేక పూజలు
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని సోమందేపల్లిలో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షురాలు మరియు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి ఉషశ్రీ చరణ్ సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు, పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బి.ఆర్. నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన ప్రవర్తన వల్ల టీటీడీ పవిత్రతకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూ, ఆయనకు సద్బుద్ధి కలగాలని ప్రార్థించారు.
అలాగే, బి.ఆర్. నాయుడును వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని, టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్ఆర్సిపి నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వైసిపి మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి