PRINT TIME: July 03, 2026 03:28 PM
సోమందేపల్లిలో నూతన పాఠశాల ప్రారంభం
సోమందేపల్లిలో నూతన పాఠశాల ప్రారంభం
May 06, 2026 05:53 PM
86 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని కొత్తపల్లి క్రాస్ వద్ద నూతన బృందావన ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ఘనంగా ప్రారంభించారు. నర్సరీ నుండి 5వ తరగతి వరకు విద్య అందించే ఈ పాఠశాలను నగేష్, అంజలి దంపతులు స్థాపించారు.
రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ, ఇతర నాయకులతో కలిసి రిబ్బన్ కటింగ్ చేసి పూజ కార్యక్రమాలతో స్కూల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల మంచి విద్యా ప్రమాణాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో రాష్ట్ర లైవ్ స్టాక్ డైరెక్టర్ శాసన కోట వెంకటేశులు, కార్పొరేషన్ డైరెక్టర్ మణిప్రియ, టీడీపీ నాయకులు వడ్డీ హనుమయ్య, నడిమిపల్లి వెంకటేష్, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు. అనంతరం స్కూల్ యాజమాన్యం నాయకులను శాలువలు, పూలమాలతో సత్కరించింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి