PRINT TIME: May 26, 2026 04:55 PM
సోమందేపల్లిలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
సోమందేపల్లిలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
March 16, 2026 03:17 PM
67 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి వెంకటరమణ పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం “పొట్టి శ్రీరాములు అమరహే” అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డి.వి. ఆంజనేయులు, ఎంపీడీవో వెంకటలక్ష్మి, టీడీపీ మండల కన్వీనర్ నడిమిపల్లి వెంకటేష్, పార్టీ నాయకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి