Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:13 PM

సోమందేపల్లి పోలీసుల అవగాహన సమావేశం… గుజిరి షాపులపై కఠిన హెచ్చరికలు

సోమందేపల్లి పోలీసుల అవగాహన సమావేశం… గుజిరి షాపులపై కఠిన హెచ్చరికలు

సోమందేపల్లి పోలీసుల అవగాహన సమావేశం… గుజిరి షాపులపై కఠిన హెచ్చరికలు
April 04, 2026 06:18 PM 160 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో గుజిరి (సెకండ్ హ్యాండ్/స్క్రాప్) షాపుల యజమానులతో పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. సోమందేపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో యస్ఐ సుధాకర్ యాదవ్ దొంగ వస్తువుల కొనుగోలు, నిల్వపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.

పోలీసులు షాపుల యజమానులకు సూచిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు వ్యవసాయ పరికరాలు, మోటార్లు, కేబుల్స్ వంటి వస్తువులు అమ్మడానికి తీసుకువచ్చినప్పుడు వాటిని కొనుగోలు చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా రైతులకు చెందిన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అలాగే, ఎవరైనా దొంగ వస్తువులను కొనుగోలు చేస్తున్నట్లు లేదా నిల్వ ఉంచుతున్నట్లు సమాచారం అందినచో, సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల పోలీసులు షాపుల్లో దొంగ వస్తువులు రికవరీ చేసినా, షాపుల యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా షాపుల యజమానులు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే సమాచారం ఇస్తామని హామీ ఇచ్చారు.

ప్రజల ఆస్తి రక్షణకు మరియు నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ పోలీసులతో సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News