సోమందేపల్లి పోలీసుల అవగాహన సమావేశం… గుజిరి షాపులపై కఠిన హెచ్చరికలు
సోమందేపల్లి పోలీసుల అవగాహన సమావేశం… గుజిరి షాపులపై కఠిన హెచ్చరికలు
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో గుజిరి (సెకండ్ హ్యాండ్/స్క్రాప్) షాపుల యజమానులతో పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. సోమందేపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో యస్ఐ సుధాకర్ యాదవ్ దొంగ వస్తువుల కొనుగోలు, నిల్వపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
పోలీసులు షాపుల యజమానులకు సూచిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు వ్యవసాయ పరికరాలు, మోటార్లు, కేబుల్స్ వంటి వస్తువులు అమ్మడానికి తీసుకువచ్చినప్పుడు వాటిని కొనుగోలు చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా రైతులకు చెందిన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అలాగే, ఎవరైనా దొంగ వస్తువులను కొనుగోలు చేస్తున్నట్లు లేదా నిల్వ ఉంచుతున్నట్లు సమాచారం అందినచో, సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల పోలీసులు షాపుల్లో దొంగ వస్తువులు రికవరీ చేసినా, షాపుల యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా షాపుల యజమానులు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే సమాచారం ఇస్తామని హామీ ఇచ్చారు.
ప్రజల ఆస్తి రక్షణకు మరియు నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ పోలీసులతో సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి