Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 17, 2026 06:43 PM

సోమందేపల్లి పీహెచ్‌సీకి కూలింగ్ వాటర్ ఫిల్టర్ వితరణ

సోమందేపల్లి పీహెచ్‌సీకి కూలింగ్ వాటర్ ఫిల్టర్ వితరణ

సోమందేపల్లి పీహెచ్‌సీకి కూలింగ్ వాటర్ ఫిల్టర్ వితరణ
March 17, 2026 04:53 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని కార్తికేయ మినరల్ వాటర్ మరియు బద్రి హోటల్ యజమాని శ్రీ మధుసూదన్ గుప్తా, వారి కుమారులు బద్రి, వంశీ కలిసి వారి తల్లిగారైన స్వర్గీయ సదాలక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం వైద్యాధికారి డా. ఓంకార్ కి బ్లూ స్టార్ కూలింగ్ వాటర్ ఫిల్టర్‌ను వితరణగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది అందరూ దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ రోజు ఆరోగ్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణీలకు పౌష్టికాహార భోజనం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. గర్భిణీలు మరియు సిబ్బంది దాతలను అభినందించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News