సంక్షేమ వసతి గృహాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలో సంక్షేమ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో గదులను, వంటలను పరిశీలించారు. విద్యా బోధన, హాస్టల్ పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యల గురుంచి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని, వసతి గృహాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి