Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:43 AM

సంక్రాంతి రద్దీతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ స్తంభన

సంక్రాంతి రద్దీతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ స్తంభన

సంక్రాంతి రద్దీతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ స్తంభన
January 17, 2026 08:16 PM 225 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

సంక్రాంతి పండగ ముగించుకుని స్వస్థలాల నుంచి తిరుగు ప్రయాణమైన ప్రజలతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పండగ సెలవులు ముగియడంతో ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరగడంతో ఎన్‌హెచ్‌పై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

రద్దీని నియంత్రించేందుకు పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను మిర్యాలగూడ, కొండమల్లేపల్లి మీదుగా మళ్లించగా, నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనాలను మునుగోడు, నారాయణపూర్ మార్గాల్లోకి మళ్లించారు.

విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలకు కోదాడ వయా హుజూర్‌నగర్, మిర్యాలగూడ, చింతపల్లి, మాల్ మార్గాలుగా దారి మళ్లింపు చేపట్టారు. అలాగే చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో రోడ్డు వెడల్పు తగ్గి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో చిట్యాల వద్ద వాహనాలను రామన్నపేట, వలిగొండ, భువనగిరి మార్గాలుగా మళ్లించారు.

ఈసారి సంక్రాంతి పండగకు రికార్డు స్థాయిలో ఏపీకి వాహనాలు వెళ్లినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కోడి పందాలు వీక్షించేందుకు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఏపీకి తరలివెళ్లినట్లు సమాచారం. తిరుగు ప్రయాణంతో ఏర్పడిన ట్రాఫిక్ రద్దీపై అప్రమత్తమైన పోలీసులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News