సంగారెడ్డిలో పునఃప్రారంభమైన స్విమ్మింగ్ పూల్ – యువతకు నూతన ఊపు
సంగారెడ్డిలో పునఃప్రారంభమైన స్విమ్మింగ్ పూల్ – యువతకు నూతన ఊపు
Krishna
సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్క్లో స్విమ్మింగ్ పూల్ను శనివారం టీజేఐసీ చైర్మన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి, అదనపు కలెక్టర్ మాధురి, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్ కలిసి ప్రారంభించారు.సుమారు రూ.20 లక్షల వ్యయంతో పూల్ను మరమ్మతులు చేసి మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి ఇటువంటి సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని,యువత ఆరోగ్యంగా ఉండేందుకు స్విమ్మింగ్ కీలకమని పేర్కొన్నారు.స్పోర్ట్స్ అథారిటీ అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు:ప్రజల సౌకర్యార్థం నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక కార్డులు అందుబాటులో ఉంచామని, అన్ని వయస్సుల వారికి ప్రత్యేక సమయాలు కేటాయించామని చెప్పారు.వేసవి కాలం దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా యువత ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరగా, కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి