Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:05 PM

సంగారెడ్డి జిల్లాలో వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

సంగారెడ్డి జిల్లాలో వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

సంగారెడ్డి జిల్లాలో వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
February 23, 2026 06:34 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

భారత ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రోగ నియంత్రణ కేంద్రం మరియు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం సంయుక్తంగా సంగారెడ్డి జిల్లాను వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్ ఫీల్డ్ పరిశీలన కోసం ఎంపిక చేసి సమగ్రంగా పరిశీలన నిర్వహించింది.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎం. వసంతరావు, వ్యాధి పరిశీలకులు, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు, రోగ నియంత్రణ కేంద్ర బృందం కలిసి జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలసి వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్ లక్ష్యాలు, అమలు విధానం, వివిధ శాఖల సమన్వయం పై చర్చించారు.తదుపరి కార్యక్రమంలో బృందం జిల్లా ప్రయోగశాలను సందర్శించి, ప్రస్తుత పరీక్షా సదుపాయాలు, వ్యాధుల గుర్తింపు సామర్థ్యం, రిపోర్ట్ ఇవ్వు విధానాలను పరిశీలించింది.అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి సూపరింటెండెంట్, వైద్యులు, ప్రొఫెసర్లు కలిసి జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల గుర్తింపు, నివారణ చర్యలపై సమగ్రంగా చర్చించారు.తదనంతరం జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ, అటవీ/వన్యప్రాణి శాఖ, వ్యవసాయ, పంచాయతీ రాజ్, మున్సిపల్, విపత్తు నిర్వహణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఆహార భద్రత శాఖ ప్రతినిధులు, పరిశోధనా కేంద్ర ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తరువాత మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని బృందం సందర్శించింది.ప్రస్తుతం వివిధ శాఖల్లో అమలులో ఉన్న పరీక్షా, రిపోర్ట్ విధానాలను అధ్యయనం చేయడం, ఆసుపత్రులు మరియు ప్రయోగశాలల సామర్థ్యాన్ని అంచనా వేయడం, వన్ హెల్త్ ప్రాజెక్ట్ సమర్థవంతంగా అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సమన్వయ విధానాలను పరిశీలించడం ప్రధాన లక్ష్యంగా ఏర్పాటుచేయబడింది.జిల్లాలో వన్ హెల్త్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులను ముందస్తు గుర్తింపు చేసి నియంత్రించడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.కార్యక్రమంలో డా. ఎం. వసంతరావు, డా. అతుల్ ఆనంద్, డా. సంజీవ్ సైని, డా. వెట్రివేల్, డా. సయన్ రాయ్, డా. కార్డిలియా, ప్రోగ్రాం అధికారులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News