సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పాలీసెట్-2026 పరీక్ష
సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పాలీసెట్-2026 పరీక్ష
Krishna
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలలో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లమా కోర్సులతో పాటు వ్యవసాయ, వెటర్నరీ డిప్లమా కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్-2026 ప్రవేశ పరీక్ష సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి. జానకీ దేవి తెలిపారు. బుధవారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు సంగారెడ్డి పట్టణం మరియు జోగిపేట్లో ఏర్పాటు చేసిన మొత్తం 6 పరీక్షా కేంద్రాల్లో 2,068 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 1,897 మంది పరీక్ష రాశారని, 171 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్షలు సజావుగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించడంతో పరీక్ష ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి