సంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైన జొన్నల కొనుగోలు కేంద్రాలు
సంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైన జొన్నల కొనుగోలు కేంద్రాలు
Reporter Sangameshwar Reddy
రైతులు మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలి:
నాయకులు, అధికారులు
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయ ఆవరణలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు సొసైటీ చైర్మన్ సిద్ధలింగయ్యస్వామి తెలిపారు. ఇదే
హద్నూర్ లొ ప్రారంభించిన దృశ్యం
సమయంలో హద్నూర్ పాక్స్లో కూడా జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. జిల్లాలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటాల్ జొన్నలకు రూ.3,699 మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు. రైతులు మధ్యదళారులను నమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు జొన్నలను తీసుకురావాలని సూచించారు. కొనుగోలు చేసిన జొన్నల డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే నేరుగా జమ అవుతాయని వివరించారు.రైతులు జొన్నలను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో పట్టాదారు పాసుబుక్, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని రైతులు పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, డీసీసీ బ్యాంక్ మేనేజర్ ధనుంజయ్, ఆర్ఐ శ్యాంరావు, సొసైటీ చైర్మన్ సిద్ధలింగయ్య స్వామి, జగన్నాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సీఐ జక్కుల హనుమంతు, ఎస్సై సుజిత్, బస్వరాజ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి