సంగారెడ్డి జిల్లా కొత్త ఆర్టీఐ అధ్యక్షులు, సభ్యులకు నియామక ఉత్తర్వులు అందజేత
సంగారెడ్డి జిల్లా కొత్త ఆర్టీఐ అధ్యక్షులు, సభ్యులకు నియామక ఉత్తర్వులు అందజేత
Krishna
జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్ పట్టణ కేంద్రంలో ఉన్న అతిథి హోటల్లో ఆదివారం నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ – సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఒక ముఖ్యమైన టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగపల్లీ హుస్సేన్, రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి ఆదేశాల మేరకు నిర్వహించబడింది. సమావేశానికి జహీరాబాద్ డివిజన్ ఉమెన్ ప్రొటెక్షన్ జాయింట్ సెక్రటరీ బి. సుమిత్ర మరియు న్యాల్కల్ మండల అధ్యక్షులు నవీన్ కుమార్ అధ్యక్షత వహించారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై సంస్థ కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణపై సభ్యులకు దిశానిర్దేశం చేశారు.అనంతరం నూతనంగా ఎన్నికైన సంగారెడ్డి జిల్లా ఆర్టీఐ అధ్యక్షులు పడకంటి శ్రీశైలం, సభ్యులు భైనగర్ సూర్య ప్రకాష్లకు నియామక ఉత్తర్వులు మరియు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ బలోపేతానికి అందరూ కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో న్యాల్కల్ మండల ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్తో పాటు వివిధ మండలాలకు చెందిన కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. సంస్థ సేవా కార్యక్రమాలను గ్రామ స్థాయిలో విస్తరించేందుకు అందరూ కట్టుబడి పనిచేయాలని నేతలు సూచించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి