Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కల్లుతనిఖీకి వెళ్లి కక్కుర్తి… కార్మికుడికే బిల్లు సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం.. ఉప్పెనలా చెలరేగిన కోహ్లీ, పడిక్కల్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 29, 2026 01:53 PM

సంగారెడ్డి జిల్లా కొత్త ఆర్టీఐ అధ్యక్షులు, సభ్యులకు నియామక ఉత్తర్వులు అందజేత

సంగారెడ్డి జిల్లా కొత్త ఆర్టీఐ అధ్యక్షులు, సభ్యులకు నియామక ఉత్తర్వులు అందజేత

సంగారెడ్డి జిల్లా కొత్త ఆర్టీఐ అధ్యక్షులు, సభ్యులకు నియామక ఉత్తర్వులు అందజేత
March 29, 2026 11:26 AM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్ పట్టణ కేంద్రంలో ఉన్న అతిథి హోటల్‌లో ఆదివారం నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ – సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఒక ముఖ్యమైన టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగపల్లీ హుస్సేన్, రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి ఆదేశాల మేరకు నిర్వహించబడింది. సమావేశానికి జహీరాబాద్ డివిజన్ ఉమెన్ ప్రొటెక్షన్ జాయింట్ సెక్రటరీ బి. సుమిత్ర మరియు న్యాల్‌కల్ మండల అధ్యక్షులు నవీన్ కుమార్ అధ్యక్షత వహించారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై సంస్థ కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణపై సభ్యులకు దిశానిర్దేశం చేశారు.అనంతరం నూతనంగా ఎన్నికైన సంగారెడ్డి జిల్లా ఆర్టీఐ అధ్యక్షులు పడకంటి శ్రీశైలం, సభ్యులు భైనగర్ సూర్య ప్రకాష్‌లకు నియామక ఉత్తర్వులు మరియు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ బలోపేతానికి అందరూ కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో న్యాల్‌కల్ మండల ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్‌తో పాటు వివిధ మండలాలకు చెందిన కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. సంస్థ సేవా కార్యక్రమాలను గ్రామ స్థాయిలో విస్తరించేందుకు అందరూ కట్టుబడి పనిచేయాలని నేతలు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News