Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:54 PM

సంగారెడ్డి జిల్లా కొత్త ఆర్టీఐ అధ్యక్షులు, సభ్యులకు నియామక ఉత్తర్వులు అందజేత

సంగారెడ్డి జిల్లా కొత్త ఆర్టీఐ అధ్యక్షులు, సభ్యులకు నియామక ఉత్తర్వులు అందజేత

సంగారెడ్డి జిల్లా కొత్త ఆర్టీఐ అధ్యక్షులు, సభ్యులకు నియామక ఉత్తర్వులు అందజేత
March 29, 2026 11:26 AM 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్ పట్టణ కేంద్రంలో ఉన్న అతిథి హోటల్‌లో ఆదివారం నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ – సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఒక ముఖ్యమైన టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగపల్లీ హుస్సేన్, రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి ఆదేశాల మేరకు నిర్వహించబడింది. సమావేశానికి జహీరాబాద్ డివిజన్ ఉమెన్ ప్రొటెక్షన్ జాయింట్ సెక్రటరీ బి. సుమిత్ర మరియు న్యాల్‌కల్ మండల అధ్యక్షులు నవీన్ కుమార్ అధ్యక్షత వహించారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై సంస్థ కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణపై సభ్యులకు దిశానిర్దేశం చేశారు.అనంతరం నూతనంగా ఎన్నికైన సంగారెడ్డి జిల్లా ఆర్టీఐ అధ్యక్షులు పడకంటి శ్రీశైలం, సభ్యులు భైనగర్ సూర్య ప్రకాష్‌లకు నియామక ఉత్తర్వులు మరియు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ బలోపేతానికి అందరూ కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో న్యాల్‌కల్ మండల ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్‌తో పాటు వివిధ మండలాలకు చెందిన కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. సంస్థ సేవా కార్యక్రమాలను గ్రామ స్థాయిలో విస్తరించేందుకు అందరూ కట్టుబడి పనిచేయాలని నేతలు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News