Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:52 AM

సిపిఐతోనే సామాన్యుల సమస్యలకు పరిష్కారం

సిపిఐతోనే సామాన్యుల సమస్యలకు పరిష్కారం

సిపిఐతోనే సామాన్యుల సమస్యలకు పరిష్కారం
April 08, 2026 12:52 PM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల హక్కుల కోసం కృషి చేస్తోందని పార్టీ జిల్లా నాయకుడు యన్. ఆనంద్ తెలిపారు.అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని, అలాగే పేదలు, చిన్న వ్యాపారస్తులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సిపిఐ బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా “ఇంటింటికి సిపిఐ” కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నారాయణఖేడ్ పట్టణంలోని కిరాణా దుకాణాలు, బట్టల షాపులు, కూరగాయల వ్యాపారులు, మిర్చి బండ్లు, కట్టింగ్ షాపులు వంటి వివిధ వృత్తుల వ్యాపారులను కలిసి పార్టీ కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ పిలుపుకు వ్యాపారస్తులు సానుకూలంగా స్పందించి సహకరించారని, వారికి విప్లవ వందనాలు తెలిపారు. ప్రజా పోరాటాలను మరింత బలోపేతం చేయాలంటే అన్ని వర్గాల ప్రజలు సిపిఐకి అండగా నిలవాలని, సామూహిక విరాళాల ద్వారా పార్టీకి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సిహెచ్ అశోక్, సతీష్, ప్రభాకర్, ప్రేమ్, మహేందర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News