సిపిఐతోనే సామాన్యుల సమస్యలకు పరిష్కారం
సిపిఐతోనే సామాన్యుల సమస్యలకు పరిష్కారం
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల హక్కుల కోసం కృషి చేస్తోందని పార్టీ జిల్లా నాయకుడు యన్. ఆనంద్ తెలిపారు.అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని, అలాగే పేదలు, చిన్న వ్యాపారస్తులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సిపిఐ బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా “ఇంటింటికి సిపిఐ” కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నారాయణఖేడ్ పట్టణంలోని కిరాణా దుకాణాలు, బట్టల షాపులు, కూరగాయల వ్యాపారులు, మిర్చి బండ్లు, కట్టింగ్ షాపులు వంటి వివిధ వృత్తుల వ్యాపారులను కలిసి పార్టీ కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ పిలుపుకు వ్యాపారస్తులు సానుకూలంగా స్పందించి సహకరించారని, వారికి విప్లవ వందనాలు తెలిపారు. ప్రజా పోరాటాలను మరింత బలోపేతం చేయాలంటే అన్ని వర్గాల ప్రజలు సిపిఐకి అండగా నిలవాలని, సామూహిక విరాళాల ద్వారా పార్టీకి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సిహెచ్ అశోక్, సతీష్, ప్రభాకర్, ప్రేమ్, మహేందర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి