Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గర్భిణీలు, బాలింతలు అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ షబానా అజీమ్ “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 02:33 PM

సిపిఐతోనే సామాన్యుల సమస్యలకు పరిష్కారం

సిపిఐతోనే సామాన్యుల సమస్యలకు పరిష్కారం

సిపిఐతోనే సామాన్యుల సమస్యలకు పరిష్కారం
April 08, 2026 12:52 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల హక్కుల కోసం కృషి చేస్తోందని పార్టీ జిల్లా నాయకుడు యన్. ఆనంద్ తెలిపారు.అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని, అలాగే పేదలు, చిన్న వ్యాపారస్తులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సిపిఐ బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా “ఇంటింటికి సిపిఐ” కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నారాయణఖేడ్ పట్టణంలోని కిరాణా దుకాణాలు, బట్టల షాపులు, కూరగాయల వ్యాపారులు, మిర్చి బండ్లు, కట్టింగ్ షాపులు వంటి వివిధ వృత్తుల వ్యాపారులను కలిసి పార్టీ కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ పిలుపుకు వ్యాపారస్తులు సానుకూలంగా స్పందించి సహకరించారని, వారికి విప్లవ వందనాలు తెలిపారు. ప్రజా పోరాటాలను మరింత బలోపేతం చేయాలంటే అన్ని వర్గాల ప్రజలు సిపిఐకి అండగా నిలవాలని, సామూహిక విరాళాల ద్వారా పార్టీకి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సిహెచ్ అశోక్, సతీష్, ప్రభాకర్, ప్రేమ్, మహేందర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News