సింగితం గ్రామంలో ఘనంగా నిర్వహించిన ఊర గంధం మహోత్సవం
సింగితం గ్రామంలో ఘనంగా నిర్వహించిన ఊర గంధం మహోత్సవం
Krishna
ఆందోల్ నియోజకవర్గంలో రాయికోడ్ సింగితం గ్రామంలో హజరత్ సుల్తాన్ అహ్మద్ షా ఉర్సు (జాతర) సందర్భంగా నిన్న రాత్రి గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి గ్రామ సర్పంచ్ కుస్నూర్ శ్రావణి నిరంజన్ అధ్యక్షతన నిర్వహించిన ‘ఊర గంధం’ మహోత్సవం గ్రామస్తుల సహకారంతో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని, ఐక్యతను చాటుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ మహోత్సవంలో స్థానిక ఎస్సై చైతన్య కిరణ్, ఉప సర్పంచ్ పెద్దగొల్ల మహేష్, బీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ పాటిల్, గౌసోద్దీన్, మైనార్టీ నాయకులు సుల్తాన్, రఫిక్, నిర్వాహకులు నబీ, మక్సుద్, సాబేర్, వార్డు సభ్యులు ప్రభాకర్, ప్రశాంత్, మొగులయ్య, అలాగే నాయకులు లక్ష్మయ్య, ఆగమయ్య, కిష్టయ్య, రామకృష్ణ, నిరంజన్, భరత్ తదితరులు పాల్గొన్నారు.గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ ఐక్యత, సోదరభావం ప్రతిబింబించేలా ఈ ‘ఊర గంధం’ మహోత్సవం సింగితం గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి