సిఈఎల్ టి శిక్షణకు ఉపాధ్యాయురాలు ఎంపిక
సిఈఎల్ టి శిక్షణకు ఉపాధ్యాయురాలు ఎంపిక
Bandi Kiran Kumar
సిఈఎల్ టి శిక్షణకు ఉపాధ్యాయురాలు ఎంపిక
వెంపటిమండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు నిమ్మనబోయిన నవీన సిఈఎల్ టీ(కోర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్) శిక్షణకు ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్) ఆధ్వర్యంలో ఎంపికయ్యారు బెంగుళూరులోని ఆర్ ఐఈ(రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్) లో దాదాపు 30 రోజులపాటు నిర్వహించబోయే కోర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ శిక్షణకు సూర్యాపేట జిల్లా నుండి ఎంపికయ్యారు ఈనెల 5వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు శిక్షణ నిర్వహించనున్నారు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి దాదాపు 50 మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు సర్టిఫికెట్ను అందజేస్తారు ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలపై ఒకరోజు ప్రదర్శన నిర్వహించాల్సి ఉంటుంది.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనర్సమ్మ మాట్లాడుతూ...సిఈఎల్టీ వంటి ప్రతిష్ఠాత్మకమైన ఇంగ్లీష్ లాంగ్వేజ్ శిక్షణకు ఉపాధ్యాయురాలుఎంపిక కావడం ఎంతో గర్వకారణమని, ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో, బెంగుళూరులోని ఆర్ఐఈలో జరుగుతున్న ఈ శిక్షణ ద్వారా ఆమె పొందే జ్ఞానం, అనుభవం పాఠశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మరింత ఉత్తమమైన బోధన అందించాలని ప్రధానోపాధ్యాయురాలు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ శిక్షణలో విజయవంతంగా పాల్గొని తిరిగి రావాలని కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి